వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది .. ఈ మ్యాచ్కు వేదికైన మాంచెస్టర్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఒకింత నిరాశకు లోనవుతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్.. వర్షం కారణంగా ఇప్పటికే ఐదు మ్యాచ్లు రద్దు అయ్యాయి .. అందులో భారత్ మ్యాచ్ ఒకటి . అయితే ఈ రోజు జరిగేది దయాదులు పోరు కాబట్టి ఎటువంటి ఆటంకం ఏర్పడ కూడదని కాకినాడలో క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేసారు. రెవెన్యూ కాలనీలోని ధర్మసాయిబాబా ఆలయంలో వరుణదేవుడు కరుణించాలని పూజలు నిర్వహించారు.