యూపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు..15 ర్యాలీల్లో రాహుల్!
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్ను లెక్కచేయకుండా కూటమి ఏర్పాటు చేసుకోవడంతో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగనుంది.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్ను లెక్కచేయకుండా కూటమి ఏర్పాటు చేసుకోవడంతో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగనుంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్లో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న రాహుల్ భారత్ తిరిగి రాగానే షెడ్యూల్ ఖరారు కానుంది. రాహుల్ గాంధీ మొత్తంగా 15 ర్యాలీల్లో పాల్గోనున్నారు.