తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగలనుంది. కాంగ్రెస్ కీలక నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్కు ఝలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్ బంధువులు తనను టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారని అన్నారు. తాను గాంధీభవన్ లో ఉంటానో లేక టీఆర్ఎస్ భవన్ లో ఉంటానో త్వరలో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్ లో ఉంటుందని అన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా దెబ్బతిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు ఎంత లాభం జరిగిందో తెలియదని పేర్కొన్నారు.