తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో ఆ రోజే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసిన తన నిర్ణయం తెలిపారు. 19న ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎంవో నుంచి అధికారులకు ఆదేశాలందాయి.