తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఏపీ వెళ్లనున్నారు. వచ్చే నెల 14న విశాఖలోని శారద పీఠంకు వెళ్లనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు నిర్వహించే విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొనున్నారు. 14వ తేది చివరి రోజు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఇప్పటికే శారద పీఠం కేసీఆర్ను ఆహ్వానించింది. ఇందుకు కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించిన హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా టూర్ షెడ్యూల్ ఖరారైంది.