ఏమీ చేయని కేసీఆర్ 88 అసెంబ్లీ సీట్లు గెలిస్తే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన టీడీపీకి ఎన్ని సీట్లు రావాలని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీకి మద్దతివ్వడం ద్వారా కేసీఆర్ ఏపీపై పెత్తనం చేయాలని చూస్తున్నారని గుంటూరు సభలో ఆరోపించారు. కేసీఆర్కు మోడీ అండగా ఉంటే ఏపీ ప్రజలకు దేశంలోని అన్ని పార్టీల మద్దతు ఉందని అన్నారు. ముగ్గురు మోడీల ఆటలు ఏపీలో సాగవని చంద్రబాబు హెచ్చరించారు. ఆంధ్రుల వ్యతిరేక పార్టీ అయిన టీఆర్ఎస్తో కుమ్మక్కై వైసీపీ టీడీపీని ఓడించాలని చూస్తోందని నెల్లూరులో జరిగిన ఎన్నికల సన్నాహక సభలో చంద్రబాబు విమర్శించారు.