శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Update: 2019-03-16 09:21 GMT

మిషన్ 150 లక్ష్యంతో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు సాయంత్రం తిరుపతి వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న నేపధ్యంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండలంలో సీఎం కుటుంబ సభ్యులకు తీర్ధప్రసాదాలు అందజేసి దీవించారు. 

Similar News