ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక టీడీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఇదే సమయంలో గాజువాక సిటింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సభా వేదిక వద్ద చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టిక్కెట్ విషయంలో డోంట్ వర్రీ సాయంత్రం ఫోన్ చేసి చెబుతానని నారా చంద్రబాబు శ్రీనివాసరావుకు హామీ ఇచ్చారు.