జగన్‌ను ఓడిస్తే కేసీఆర్‌కు గుణపాఠం వస్తుంది : చంద్రబాబు

Update: 2019-04-09 06:34 GMT

ఎలక్షన్‌ మిషన్ 2019పై పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని, చివరి నిమిషం వరకు ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్‌ లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

టీఆర్ఎస్, వైసీపీ బంధానికి నిన్నటి కేసీఆర్ వ్యాఖ్యలే రుజువని చంద్రబాబు అన్నారు. ఇన్నాళ్లూ చాటుగా జగన్‌కు డబ్బులు పంపిన కేసీఆర్ ఇప్పుడు బాహాటంగానే మద్దతు ప్రకటించారన్నారు. ఏపీ బాగుండాలనుకుంటే పోలవరంపై కేసులెందుకు వేశారని కేసీఆర్‌‌ను ప్రశ్నించారు. కృష్ణాపై 9 ప్రాజెక్టులు, గోదావరిపై 4 ప్రాజెక్టులను తెలంగాణ అడ్డుకుందని చంద్రబాబు ఆరోపించారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుకు ఎందుకు వ్యతిరేకమో కేసీఆర్ చెప్పాలి నిలదీశారు. జగన్‌ను ఓడిస్తే కేసీఆర్‌కు గుణపాఠం వస్తుంది పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

Similar News