ఢిల్లీలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్..

Update: 2019-05-16 08:25 GMT

చైన్‌ స్నాచింగ్‌లు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు చైన్‌ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలో ఓ మహిళ మెడలోని చైన్‌ను లాక్కుపోయారు. దీంతో ఆమె మెడపై గాయాలయ్యాయి. దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో మొత్తం రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

Similar News