టీడీపీ ఎంపీ సుజనా చౌదరి సంస్థలపై సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న హైదరాబాద్ పంజాగుట్ట నాగార్జునా హిల్స్లోని సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. నిన్న ఉదయం నుంచి సోదాలు చేసిన సీబీఐ అధికారులు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు డైరెక్టర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. షల్ కంపెనీల వ్యవహారంపై దృష్టి పెట్టిన అధికారులు బ్యాంకుల నుంచి రుణాలు పొందిన పత్రాలతో పాటు బ్యాంకులకు ఇచ్చిన ఇన్ వాయిస్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇవాళ కూడా సోదాలు కొనసాగుతాయని నోటీసులు జారీ చేశారు.