పారిశ్రామికవేత్త జయరాం మర్డర్ కేసులో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన బంజారాహిల్స్ పోలీసులు శిఖాచౌదరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జయరాం హత్య తర్వాత ఇంట్లోకి చొరబడి విలువైన పత్రాలు, ఆభరణాలు తీసుకెళ్లిందని ఆయన భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఫైల్ చేశారు. శిఖాచౌదరితోపాటు ఆమె స్నేహితుడు సంతోష్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక జయరాం హత్య కేసులో రాకేష్ స్నేహితుడు సుభాష్రెడ్డిని అరెస్ట్ చేయడంతో నిందితుల సంఖ్య ఐదుగురికి చేరింది. నిందితులు నగేష్, విశాల్, సుభాష్లను ఈరోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.