కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై కేసు న‌మోదు

Update: 2019-04-16 14:25 GMT

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బు వ్యవహారంలో సందీప్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఎస్‌ఐని బంధించి చిత్ర హింసలకు గురిచేశారన్న ఆరోపణలపై ఐపీసీ 332, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్సై కృష్ణను గదిలో బంధించి బూతులు తిడుతూ విశ్వేశ్వర్‌రెడ్డి విధులకు ఆటంకం కలిగించారు. తన సిబ్బందితో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి డ్యూటీలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేశాడు. ఈ ఘటనపై ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News