హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కారు బీభత్సం స్పష్టించింది. రోడ్ నెంబర్ వన్ దగ్గర వీధి దీపాల కోసం ఏర్పాటు చేసిన కరెంటు పోల్పైకి ఓ కారు ఎక్కింది. సైదాబాద్కు చెందిన షఫీ తన నలుగురు స్నేహితులతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లి కరెంటు పోల్ను ఢీ కొట్టడంతో మూడు అడుగుల మేర పైకి ఎక్కింది. ఇదేసమయంలో కరెంటు వైర్లు కిందకు పడ్డాయి. ఇవి కారుకు తగలక పోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.ఎయిర్బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.