వైసీపీ అధికారంలోకి వస్తే వారిపై చర్యలు తప్పవు: బొత్స

Update: 2019-04-22 10:23 GMT

తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యానారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పాలన అంతా అవినీతితో సాగిందన్నారు. ఏపీలో జరిగినంత ఘోరమైన పాలన దేశంలో ఎక్కడ చూడలేదని, ఐదేళ్ల పాలనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై యనమల వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై మాజీ సీఎస్‌లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బొత్స సత్యానారాయణ డిమాండ్ చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. చంద్రబాబు యథేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని, నెల రోజుల్లో ఖాళీ చేసే టీడీపీ ప్రభుత్వ అక్రమాలకు అధికారులు ఎవరూ సహకరించడవద్దని కోరారు. 

Similar News