మా ఎమ్మెల్యేలను లాక్కోనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కర్ణాటక సీఎం కుమారస్వామి. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడటం లేదని ఆయన చెప్పారు. మోడీ ఒకవైపు అసత్యాలు చెబుతూనే మరోవైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వీటన్నింటిపై ఆధారాలతో సహా రుజు చేస్తామని చెప్పారు. మా ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరచూపి ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అసత్యాల ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందని అన్నారు. ఎమ్మెల్యేకు డబ్బు ఎరవేస్తున్న అంశంపై ఆడియో టేపును కుమారస్వామి విడుదల చేశారు.