కేసీఆర్ తక్షణమే యావత్ దళితజాతికి క్షమాపణ చెప్పాలి: కిషన్‌రెడ్డి

Update: 2019-04-18 12:10 GMT

హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ కార్యక్రమాన్ని చేపట్టినట్టు బీజేపీ నేత కిషన్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు మందకృష్ణను అరెస్టు చేయడాన్ని బీజేపీ ఖ‌ండిస్తోందన్నారు కిషన్‌రెడ్డి. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ చెత్త వాహనంలో తరలించడాన్ని ఆయన ఖండించారు. ఆ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే యావత్ దళితజాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

Similar News