టీఆర్ఎస్ హత్య రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. గెలిచిన వారిని టార్గెట్ చేసి భౌతికంగా దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మహాదేవుని పేటలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి వరలక్ష్మీని మహబూబ్ నగర్ హస్పిటల్లో లక్ష్మణ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి 25వేల ఆర్థిక సహాయం అందించారు. డోకూర్ గ్రామంలో రాజకీయ హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను లక్ష్మణ్ పరామర్శించారు.