పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలిందన్నారు బీజేపీ నేత జీవీఎల్. మమతా బెనర్జీకు షాక్ ఇస్తూ సీబీఐ విచారణకు కోల్కతా సీపీ రాజీవ్ కుమార్ సీబీఐ ముందు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం హర్షణీయమన్నారు. మమతా చిట్ఫండ్స్ స్కాములు చేసిన అక్రమార్కులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా మమత బెనర్జీలాగా వ్యవహరిస్తున్నారని ఆయనకు ఇలాంటి గుణపాఠమే ఎదురవుతుందన్నారు.