ఆపార్టీపై జనంలో నమ్మకం పోయింది.. ఇక గూలాబీకి ప్రత్యామ్నాయం బీజేపీనే: డీకే
తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా లేక టీఆర్ఎస్ నాయకులా అని ప్రశ్నించారు బీజేపీ నేత డీకే అరుణ. నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. చట్టాల్లో మార్పు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంసరైంది కాదని హితవుపలికారు. కేవలం ఓటమి భయంతోనే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని డీకే అరుణ విమర్శించారు. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్పై జనంలో నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వారిని గెలిపించినా చివరికి టీఆర్ఎస్లోనే చేరతారని అన్నారు. దేశమంతా మరోసారి నరేంద్ర మోడీయే దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని స్పష్టంచేశారు.