బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ.. బీజేపీ కార్యకర్త దారుణ హత్య

Update: 2019-06-05 05:09 GMT

మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. దేవరకద్ర మండలం డోకూరు ఎంపీటీసీగా బీజేపీ అభ్యర్థి భూపాల్ రెడ్డి గెలిచారు. మంగళవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ నిర్వహిస్తుండగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య తలెత్తిన ఘర్షణలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ ను ప్రత్యర్థులు కత్తులతో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడగా వెంటనే ప్రేమ్ కుమార్‌ను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిమధ్యలో మృతి చెందాడు. ప్రేమ్ కుమార్ హత్యపై పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.  

Tags:    

Similar News