టీ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత డీకే. అరుణ బీజేపీ గూటికి చేరడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇక మరికొందరు నేతలు అప్పుడే టీఆర్ఎస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. కాగా టీఆర్ఎస్కు పోటీగా ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీ కూడా ప్రారంభించింది . తాజాగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ప్రతాప్ రెడ్డి మంతనాలు జరిపారు. మంతనాల అనంతరం టీఆర్ఎస్ గూటికి చేరాలని ప్రతాప్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో షాద్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రతాప్ పోటీ చేశారు.
అయితే కాంగ్రెస్కు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో పాటు మాజీ పీసీసీ చీఫ్తో బీజేపీ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక మాజీ మంత్రితో చర్చలు జరిగాయని చెబుతున్నారు. అలాగే మాజీ సీఎల్పీ నేత కుమారుడితో పాటు హైదరాబాద్కు చెందిన ఓ మాజీ మంత్రి కుమారుడితోనూ బీజేపీ నేతలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.