వైసీపీ ఎమెల్యేలతో బాలయ్య సరదా ముచ్చట్లు ..

Update: 2019-06-12 08:13 GMT

నేడు ఎపి శాసనసభ సమావేశాలు ప్రారభం అయ్యాయి ..ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు అందరు ఎమెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు .. మొత్తం శాసనసభ వైసీపీ మరియు టిడిపి ఎమెల్యేలతో కళకళలాడింది .. అంతేకాకుండా అందరు ఎమెల్యేలు ఒకరిని ఒకరు పలకరించుకున్నారు ... సరదా సంభాషణలతో నవ్వుల పువ్వులు పూయించారు...

అందులో భాగంగా సినీ నటుడు , హిందూపురం ఎమెల్యే బాలకృష్ణ కూడా వైసీపీ ఎమ్మెల్యేలతో సరదాగా గడిపారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే జోగి రమేష్‌లతో నందమూరి బాలయ్య కరచాలనం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలతో కాసేపు ముచ్చటించారు. అలాగే మంత్రి కొడాలి నాని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ పలకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొడాలి నానికి శుభాకాంక్షలు తెలిపారు

Tags:    

Similar News