రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రౌడీయిజం చేసి ఎవరూ ఓటేయకుండా భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన తనకెలాంటి భయం లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలపై పోరాటం కొనసాగుతుందని ఎన్నికలకు ముందే వందశాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. కానీ ఎన్నికల సంఘం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ఆరున్నర రోజులు పడుతుందని సుప్రీం కోర్టుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని చంద్రబాబు ఆరోపించారు.