టీడీపీ మీద 12 మంది నేతలతో విమర్శలు చేయిస్తున్నారు

Update: 2019-01-29 07:12 GMT

బీజేపీ, వైసీపీలపై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో భవిష్యత్‌ లక్ష్యాలపై మార్గదర్శకం చేశారు. గడచిన నాలుగున్నరేళ్లలో బీసీలకు ఏం చేశామో చెప్పాలని భవిష్యత్‌లో ఏం చేస్తామో వివరించాలంటూ నేతలకు సూచించారు. జయహో సభతోనే ప్రతిపక్షనేత జగన్‌కు బీసీలు గుర్తుకు వచ్చారని పార్టీకి చెందిన 12 మంది నేతలతో విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను పోరాడుతుంటే బీజేపీతో కుమ్మక్కై రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ విమర్శించారు. కేంద్రం నుంచి లక్షా 16 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న బాబు కేంద్ర ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ ముందు రోజు ఢిల్లీలో దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. ఇందుకోసం వచ్చే నెల ఒకటిన ఢిల్లీ వెళుతున్నట్టు బాబు తెలియజేశారు. 

Similar News