రైతులకు మరో శుభవార్త .... నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన సమయంలోనే ఒడిషా తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణల కేంద్రం తెలియజేసింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని పలు చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.