2017లో రవాణా శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం కేసు మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమా, బుద్ధా వెంకన్నలకు నోటీసులు జారీ చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. గతంలో జారీ చేసిన నోటీసులు తమకు అందలేదంటూ నిందితుల తరపు న్యాయవాదులు తెలియజేయడంతో స్వయంగా నోటీసులు అందజేయాలని విజయవాడ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది.