అలిపిరిలో తమిళనాడు భక్తులపై దాడి చేసిన పోలీసులు... రివర్స్లో వారిపైనే కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న తమపై తమిళనాడు చెంగల్ పట్టుకు చెందిన కనియప్పన్ దాడి చేశాడంటూ ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో తమిళనాడు భక్తులపై అలిపిరి పోలీసులు సెక్షన్ 332, 353 కింద కేసు నమోదు చేశారు.
భక్తులపై కేసు నమోదు చేయడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. విషయం తెలుసుకొన్న టీటీడీ బోర్డ్ మాజీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్కు వచ్చిన స్టేషన్ ఆఫీసర్ను నిలదీశారు. భక్తులపై దాడి ఘటనలో ఈవో అనిల్కుమార్ సింఘాల్ స్పందించి క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. తమిళ భక్తులపై దాడి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని టీటీడీ బోర్డ్ మాజీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.