అగస్టా వెస్ట్లాండ్ కుభకోణంలో కీలక నిందితులు రాజీవ్ సక్సేనా, దీపక్ తల్వార్లను ఈడీ అదుపులోకి తీసుకుంది. వీరిని దుబాయ్ నుంచి భారత్ కు రప్పించారు. రాజీవ్ సక్సేనా దుబాయ్లో వ్యాపారవేత్త తల్వార్ కార్పొరేట్ ఏవియేషన్ లాబీయిస్ట్, వీరిద్దరినీ దుబాయ్ అధికారులు నిర్బంధించారు. వీరిపై మనీలాండరింగ్, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లోని పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. అగస్టా వెస్ట్లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ను ఇప్పటికే భారత్ కు రప్పించి విచారిస్తున్నారు.