భారత నౌకాదళ చీఫ్గా అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఈ కార్యక్రమం జరిగింది. అడ్మిరల్ సునిల్ లంబా నుంచి అయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కరంబీర్ సింగ్ మాట్లాడుతూ 24వ నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తానని కరంబీర్ తెలిపారు. అడ్మిరల్ సునిల్ లంబా భారత నౌకాదళాన్ని ఎంతో పటిష్టం చేశారని, నేవీకి ఆయన సేవలను కొనియాడుతున్నట్లు కరంబీర్ తెలిపారు. మాజీ చీఫ్ అడ్మిరల్ సునిల్ లంబా ఇవాళ రిటైర్ అయ్యారు..