బెంగళూరులోని యళహంక ఏయిర్బేస్లో నిర్వహిస్తున్న ఏరో ఇండియా షోలో అపశృతి చోటు చేసుకుంది. గేట్ నెంబర్ 5 దగ్గర కారు పార్కింగ్ ప్లేస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత ఓ కారులో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. సుమారు 150 కార్లకు మంటలు వ్యాపించడంతో పొగలు దట్టంగా వ్యాపించాయి. ఇటు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.