అధికారంలోకి వచ్చాక రోజాకి కీలక పదవి

Update: 2018-11-17 11:09 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మానసిక స్థితి నిలకడగా ఉందని, ఇకపై తను ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా నగిరిలో శనివారం ఎర్పాటుచేసిన బహిరంగసభలో విజయసాయి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికావడం ఖాయం, అలాగే ఎపీ వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు. అలాగే వైఎస్ఆర్ సీపీ అధికారపగ్గాలు చేపట్టిన మరుక్షణమే ఎమ్మెల్యే రోజాకు కీలక పోస్ట్ వర్తిస్తుందని ప్రకటించారు. మహిళల సమస్యలపై రోజా పోరాటం మరువలేనివని ఆయన గుర్తుచేశారు.

Similar News