తనపై జరిగిన దాడి కేసు విచారణను స్వతంత్ర సంస్ధకు అప్పగించాలంటూ వైఎస్ జగన్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ విచారణ కీలక మలుపు తిరిగింది. కేసు విచారణ జరుపుతున్న అధికారులకు సీఆర్పీసీ 161 ప్రకారం స్టేట్మెంట్ ఇవ్వాలంటూ జగన్ను హైకోర్టు ఆదేశించింది. మంగళవారం లోపు స్టేట్ ఇవ్వాలని ఆదేశించిన కోర్టు కేసు పూర్తి నివేదికను తమకు అందజేయాలంటూ సిట్ను ఆదేశించింది.