బాబు కాలుపెడితే బూడిదే

Update: 2018-12-12 06:31 GMT

టీడీపీ, కాంగ్రెస్‌ల అపవిత్ర పొత్తును తెలంగాణ ప్రజలు విజ్ఞతతో తిప్పికొట్టారంటూ వ్యాఖ్యానించారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిన్న శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన ఆముదాల వలసలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించిన ఆయన భస్మాసురుడు చేయి పెట్టినా చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదేనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఈ విషయం దేశం అంతా అర్థమైందంటూ  తెలిపారు. అవసరానికో పొత్తు పూటకో మాట, రోజుకో బాట పట్టే చంద్రబాబుకు ఏపీ ప్రజలు కూడా బుద్ది చెబుతారని జగన్ తేల్చిచెప్పారు.  
 

Similar News