తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, ముందుగా చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ రాజీనామాలను నేడు స్పీకర్ కు సమర్పించారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, ‘మేం చెప్పిందే చేశాం. మా ఎంపీలు రాజీనామా లేఖలు సమర్పించారు. చంద్రబాబుకు నేను సవాల్ విసురుతున్నా. మీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించండి. ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం అందరం ఐక్యమత్యంగా నిలబడదామ’ని ట్విటర్లో రాసుకొచ్చారు వైఎస్ జగన్.
We do as we say! YSRCP MPs are submitting their resignations today. I challenge @ncbn to make TDP MPs resign and stand united with the people of AP in their rightful demand of special category status for Andhra Pradesh.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2018