యశోద ఆస్పత్రిలో మరో ఘోరం

Update: 2018-02-14 09:52 GMT

హైదరాబాద్ మలక్ పేటలో ఉన్న యశోదా హాస్పిటల్ లో మరో ఘోరం జరిగింది. వారం క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఈ ఆసుపత్రిలో జాయిన్ అయింది. నాలుగు రోజుల క్రితం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్యంగా ఉన్న ఆమె బుధవారం చనిపోయిందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురై.. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడకు చెందిన ప్రవీణ్, బిల్ గేట్ హాచార్ భార్య, భర్తలు. వారం రో్జుల క్రితం డేలివరి కోసం మలక్‌పేట్‌లోని యశోద హాస్పిటల్‌కు వచ్చారు. ఇప్పటివరకు 10 లక్షలు కటించుకొని, ఇవాళ బాలింతరాలు చనిపోయిందని చేప్పడంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
 

Similar News