గులాబీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే

Update: 2018-12-15 15:08 GMT

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరికలు ప్రారంభం రాములు నాయక్ తో మొదలు కావడం ఎంతో సంతోషాన్ని కల్గించిందన్నారు కేటీఆర్‌. చెప్పారు. వైరా నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌ గాలి వీస్తే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, రాబోయే రోజుల్లో గులాబీ జెండా అన్ని నియోజకవర్గాల్లో ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు.  

Similar News