వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి

Update: 2018-10-22 09:18 GMT

డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ బాలింత బలైంది. సిజేరియన్‌ ఆపరేషన్‌ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌ పెద్దపేగు కత్తిరించారు. పేగుకు సరిగా కుట్లు వేయకపోవడంతో ఇన్ఫెక్షన్‌ సోకి నెల రోజుల తర్వాత బాలింత చనిపోయింది. హైదరాబాద్‌ చౌటుప్పల్‌కు చెందిన శ్వేతను డెలివరీ కోసం వనస్థలిపురం లైఫ్‌ స్ప్రింగ్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, సిజేరియన్‌ ఆపరేషన్‌ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు పెద్దపేగు కత్తిరించారు. పేగుకు సరిగా కుట్లు వేయకపోవడంతో ఇన్ఫెక్షన్‌ సోకి శ్వేత చనిపోయింది. దీంతో బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
 

Similar News