ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. భర్త రెండో భార్య ఇంటి నుంచి కదలడం లేదన్న అక్కసుతో మొదటి భార్య చేయరాని పని చేసింది. అతని జననావయవాలను కత్తితో కోసేసింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ మిమ్లానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనను పట్టించుకోకుండా రెండో భార్యతోనే భర్త ఎక్కువ గడపడమే ఆమె కోపానికి కారణం అంటున్నారు. మొదటి భార్య అంగీకారంతోనే రెండో పెళ్లిచేసుకోగా... ఇటీవలే రెండో భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది... అయితే ఆ తర్వాత తనను పట్టించుకోవడంలేదు అనేది మొదటి భార్య ఆరోపణ. ఆ కోపంతోనే ఆమె భర్త మర్మాంగాలను కోసేయగా... పరిస్థితి విషమంచిన ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన మొదటి భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు.