2019 లోక్‌స‌భ‌కు నేను రెఢీ : క‌మ‌ల్‌హాస‌న్‌

Update: 2018-12-22 10:32 GMT

జయలలిత, కరుణానిధిలు కన్నుమూతతో తమిళనాట రాజకీయం వెలవెల బోయింది. ఇదే నేపథ్యంలో తమిళనాట ఇద్దరు అగ్రహీరోలు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వారే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్‌హాసన్ ఎంట్రీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేందుకు కమల్ హాసన్ సై అన్నారు. తాజాగా కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది ఇలాఉంటే కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ పోటీకి దిగుతుందని కమల్ స్పష్టం చేశారు. అలాగే తమ పార్టీ స్పష్టమైన ఘనవిజయం సాధించడం ఖాయం అని కమల్ విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాట తమ అభ్యర్ధులను 39 స్థానాల్లో లోక్ సభ అభ్యర్థులను పోటీకి నిలబెట్టనున్నట్లు కమల్ స్పష్టం చేశారు.

Similar News