భర్త, ఇద్దరు కూతుళ్లున్న ఓ వివాహిత.. మరొకరితో సంబంధం పెట్టుకుని.. బజారును పడింది. కోటీశ్వరుడైన వ్యాపారవేత్తకు భార్య అయినా.. తప్పుదారి పట్టి సంసారాన్ని నాశనం చేసుకుంది. హైదరాబాద్ అమీర్పేట్కు చెందిన 35 యేళ్ల ఓ వివాహిత.. తనకంటే పదేళ్ల చిన్నవాడైన మాధవ్ అనే కుర్రాడితో సంబంధం పెట్టుకుంది. భర్త బిజినెస్ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో కారు వాషింగ్ షాప్ ఓనర్ అయిన పాతికేళ్ల మాధవ్ తో పరిచయం పెంచుకుని రహస్యంగా సంబంధం పెట్టుకుంది.
ఓ రోజూ అమీర్పేట్ ధరంకరం రోడ్డులో కలుసుకున్న వీరిద్దరిని భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అయితే అప్పటి నుంచి తాను మారుతానని.. తప్పుడు పనులేవీ చేయబోనని భర్తను వేడుకుంది. అయినా మారని ఆ వివాహిత.. తన ప్రియుడు మాధవ్ను కారులో ఎక్కించుకుని గోవాకు పారిపోయింది. అయితే దీన్ని ముందే గమనించిన భర్త.. భార్య కారుకు జియో ట్యాగ్ అమర్చాడు. దీంతో తన భార్య గోవాలోని ఓ హోటల్లో ఉందని.. తనను అరెస్ట్ చేయాలని.. ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. తనను మోసం చేసిన తన భార్యపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని.. తన కూతుళ్లను తనదగ్గరే పెంచుకునేందుకు అనుమతివ్వాలంటూ.. పోలీసులికిచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నాడు.