ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడు గుండెపోటుతో మృతి

Update: 2018-12-07 09:24 GMT

ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది.  చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన నర్సింహ  పోలింగ్ బూత్‌కు ఓటు వేసేందుకు వచ్చాడు. అనంతరం అక్కడగల క్యూలైన్ లో నిలబడి ఉండగా అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుప్పకూలిపోగా పక్కనే ఉన్న వారు ఆయన్ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మృతిచెందాడు. దీంతో నర్సింహ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.

Similar News