తెలంగాణలో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 43 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ పార్టీ ఆధిక్యంలో ఉండనుందో, ఏ పార్టీ గెలవనుందో వీటన్నంటికి చెక్పడనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉంది.