వరంగల్ అర్బన్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థికి జనం షాకిచ్చారు. స్టేషన్ఘనాపూర్ నియోజకవర్గం పరిధిలోని ధర్మసాగర్ మండలం కరుణపురం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన తాటికొండ రాజయ్యను స్థానికులు అడ్డుకున్నారు. కరుణపురం, పెద్ద పెండ్యాల గ్రామాలకు నువ్వేం చేశావని ప్రశ్నించారు. మా గ్రామాలకు రావొద్దు, నీకెందుకు మేం ఓట్ల వేయాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఫాదర్ కొలంబో పేరుతో వందలాది ఎకరాల భూమని ప్రభుత్వానికి ధారాదత్తం చేశావంటూ నిలదీశారు. ఈ సారి ఓడించడం ఖాయమని హెచ్చరించారు. దీంతో పోలీసులు, టీఆర్ఎస్ నేతలు వారిని అక్కడి నుంచి తొలగించారు.