వియత్నాం డనంగ్ పట్టణంలో నిర్మించిన గోల్డెన్ బ్రిడ్జి టూరిస్టులను ఆకట్టుకుంది. రెండు అరచేతులు పట్టుకున్నట్లుగా రూపొందించిన ఈ కట్టడాన్ని తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దూరం నుంచి చూస్తే రెండు చేతులే ఈ వంతెనను పడిపోకుండా పట్టుకున్నాయా అనిపించేంత అద్భుతంగా దీనిని కట్టారు. సముద్రానికి 1400 అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. సందర్శకులను అలరించేందుకు వంతెనకు అటు ఇటు పర్పుల్ రంగులో ఉండే లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు. వియత్నాం వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు.