ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అస్వస్థత?

Update: 2018-11-25 17:02 GMT

గజ్వేల్‌ ప్రజాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అస్వస్థతకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలు పోలీసుల సహకారంతో డబ్బు పంచుతున్నారంటూ గజ్వేల్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ఒంటేరు ప్రతాప్‌రెడ్డి దీక్ష చేశారు. పోలీసులు ఈ దీక్ష భగ్నం చేసే సమయంలో ఒంటేరు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనను సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News