మిమ్మల్ని సతాయిస్తే బాగుంటుంది కదా

Update: 2018-08-24 05:24 GMT

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. 'గీత గోవిందం' చిత్ర బృందాన్ని అభినందించారు. గురువారం కవిత ఈ సినిమా చూశారట. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌లను కలిశారు. ఈ సందర్భంగా తాను గీతగోవిందం సినిమాను రెండు సార్లు చూసినట్టు కవిత వెల్లడించారు. సినిమా చూశారా? ఎలా ఉంది? అని కవితను విజయ్ దేవరకొండ అడగ్గా.. ‘మస్తుంది సినిమా.. మిమ్మల్ని సతాయిస్తే బాగుంటుంది కదా’ అని నవ్వుతూ తెలిపారు. ‘సినిమా రెండు సార్లు చూశాను. ఫస్ట్ నేను చూశాను. తరువాత మా వదినా వాళ్లు చూద్దాం అంటే వెళ్లాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలనుకుంటున్నారు’’ అని తెలిపారు కవిత.

Similar News