కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోటీసులు

Update: 2018-07-26 09:13 GMT

కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరేశం నల్గొండ జిల్లా ఎస్పీకి కంప్లయింట్ చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో సంబంధం ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు వీచ్ , రేవంత్ రెడ్డిలకు నోటీసులు పంపారు. వారం రోజుల్లో కాంగ్రెస్‌ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం సివిల్‌, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వారి ఆరోపణలను ప్రచారం చేసిన రెండు టీవీ ఛానళ్లుకు కూడా ఎమ్మెల్యే లీగల్ నోటీసులు పంపారు.

Similar News