వరంగల్ టీఆర్ఎస్‌లో వర్గపోరు

Update: 2018-10-02 10:37 GMT

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. 13, 14 డివిజన్లకుచెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు క్రిస్టల్ గార్డెన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, మేయర్ నరేందర్
 ఎదుటే టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో సమావేశం మధ్యలో ఆగిపోయింది. కార్యకర్తల సమావేశంలో ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ తోపులాటకు దారితీసింది. ఎంపీ, మేయర్ సర్దిచెప్పినా కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇరువర్గాల తోపులాటతో సమావేశం రసాభాసగా మారింది. చివరికి పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

  

Similar News