టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రణరంగంగా మారింది. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రగడ మొదలైంది. ఒకరినోకరు తోసుకున్నారు. కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ తోపులాటలో చాలా మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. అతి కాస్త చీలికి చీలికి గాలివానగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రచారాన్ని నిలిపేశారు.
గోవర్ధనగిరిలో ప్రచారానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ను కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని అక్కన్న పేట మండలం నుంచి హుస్నాబాద్లో కలపాలని డిమాండ్ చేయడంతో పాటు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులకు సర్థిచెప్పేందుకు ఎంత ప్రయత్నించిన ఆందోళనకారులు పట్టించుకోకపోవడంతో గొడవ మొదలైంది. దీంతొ ఇరుపార్టీ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని ఇరుపార్టీ నేతలను శాంతింపజేయడంతో గొడవ సద్ధమణిగింది.